గౌరవనీయులైన భారత్ పెట్రోలియం ఉన్నతాధికారులకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామ కాపురస్తుడు ఎంబేటి శ్రీనివాసులు వ్రాసుకున్న ఫిర్యాదు
అయ్యా! ఎంబేటి శ్రీనివాసులు అను నేను తే 14/04/2017 ది న శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్(చెందోడు)నందు గల తమ సంస్థ యొక్క డిలరు అయిన శ్రీవెంకటేశ్వరా ఫ్యూయల్స్ నందునాయొక్క అవసరం నిమిత్తం రూ. 400 లకు పెట్రోలును డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయటం జరిగింది. సదరు బంకు ఉద్యోగులు 400 రుపాయలకు కొనుగొలుకు గాను 404 రుపాయలు నగదును నాయొక్క ఖాతానుండి వసూలు చేసినారు ఎందుకని అదనంగా వసూలు చేసినారు అని అడిగితె మాదగ్గర అంతే అని బదులిచ్చినారు .అదేమిటయ్యా ఎక్కడా లేదే నేను చాలా బంకుల్లో పట్టినా ఎక్కడా అదనపు వసూలూ చేయలేదే అని నేను అడిగితే. సదరు బంకు సిబ్బంది ఇక్కడింతే నీకు దిక్కున్నచోట చెప్పుకోఅని నాతో చాలా దురుసుగా ప్రవర్తించినారు. మీ మేనేజరు లేదా ఓనరు ఎవరు అని అడిగినా అసలు సమాధానము కూడా చెప్పకుండా కనీసం నాకు పెట్రోలు బిల్లు కూడా ఇవ్వలేదు. అదేమని అడిగితే మా యజమాని కార్డు చెల్లింపులకు పెట్రోలు బిల్లు ఇవ్వ వద్దని చెప్పినాడనియు కావున మేము ఇవ్వబోమని అత్యంత దురుసుగా సమాధానం చెప్పినాడు. అయ్యా సదరు అదనపు మొత్తానికి చట్టబద్దత ఉందా? చట్టబద్దత ఉంటే మిగతా పెట్రోలు బంకులవారు వసూలు చేయటం లేదుకదా.సదరు బంకు వారు నాకు తెలిసినంతవరకూ నాదగ్గర వసూలు చేసిన నాలుగు రూపాయలు ఖచ్చితంగా అక్రమ వసూలే. కావున తమరు వెంటనే స్పందించి సదరు బంకు వారిపై తగు చర్యలు తీసుకొని అదనంగా వసూలు చేసిన నాయొక్క నగదును నాకు తిరిగి నాయొక్క ఖాతాకు జమచేయించగలరు. సదరు సిబ్బంది యొక్క దురుసు మరియు అమర్యాదకర ప్రవర్తనపై తమరు తీసుకొనే కఠిన చర్యలు ఇకపై వినియోగదారులతో మర్యాదగా ప్రవర్తించేలా ఉండగలవని ఆశిస్తూ.
మీ ప్రియమైన వినియోగదారుడు
ఎంబేటి శ్రీనివాసులు
బాలిరెడ్డిపాళెం
వాకాడు మండలం
[protected] Was this information helpful? |
Post your Comment