ఈనాడు దినపత్రిక యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలతో చేయు ఫిర్యాదు ఏమనగా!
ఉమ్మడి అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గ డివిజన్ ఇంచార్జి మరియు కదిరి పట్టణ ఈనాడు దినపత్రిక పాత్రికేయులు చలపతి, రమణ ల కష్టాలు అంతా ఇంతాకాదు పాపం. వీరి పాత్రికేయవృత్తి పెనం మీదకెళ్ళి పొయ్యిలో పడ్డట్టు సందు సందు, గొంది గొంది గత మూడు రోజులు గా ఉబ్బజాత్రలా వార్తలు సేకరిస్తున్నారు పాపం. ఇన్నిరోజులు ఆర్ అండ్ బి విడిది ప్రాంగణంలోనో లేదా టీ స్టాల్ల లోన కళాశాల ప్రాంగణాలలోన కనిపించే వీరు ఏమి జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు సందుల్లోన, గొందుల్లోన అడిగి మరి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఇన్నిరోజులు ఇళ్లల్లో కూర్చొని ఇతర సంస్థలలో పనిచేసే పాత్రికేయులకు ఫోన్లు చేసి వార్తలు రాసేవారు పాపం. ఇప్పుడు మాత్రం చాకిరేవు బ్రదర్స్ నేరుగా సమాజంలో తిరిగి మరి వార్తలు సేకరిస్తున్నారు. కదిరి పట్టణ మరియు పట్టణ పరిసర ప్రాంతాలలోని ప్రజలు ఎందుకు ఈనాడు సంస్థ చాకిరేవు బ్రదర్స్ ను ఒత్తిడికి గురిచేసి, వసూళ్లు చేసుకోనివాకుండా ఇబ్బంది పెడుతోంది అని ఆశ్చర్యపోతూ వింతగా చర్చించుకొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిదంగా, గడిచిన మూడు రోజులనుండి ఎందుకు ఈనాడు పత్రికలో ఎక్కడ చూసినా కదిరికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఇన్నిరోజులు ఏమైందో అంటే అర్థం ఉమ్మడి అనంతపురం జిల్లా ఈనాడు సంస్థలో పనిచేస్తున్న సబ్ఎడిటర్, డెస్క్ ఇంచార్జి మరియు మేనేజర్ కు, కదిరి ఈనాడు సంస్థ నియమించుకున్న పాత్రికేయ బ్రోకర్లనటువంటి చాకిరేవు బ్రదర్స్ కు మధ్య వున్నటువంటి ఒప్పందం ఏ స్థాయిలో వున్నది అని అర్థం చేసుకోవాలి.
ఇటువంటి బ్రోకర్లను పాత్రికేయులుగా నియమించుకొని ఎదో మేనేజర్ కొత్తగా వచ్చినప్పుడు చలపతి అనంతపురం ఈనాడు కార్యాలయానికి వెళ్లి ఫుస్ఫగుచ్చం ఇచ్చి ఫోటో తీసి whatsup స్టేటస్ పెట్టుకొని కుదుర్చుకున్న ఒప్పందం ఎంత బలమైనది అని కదిరి నియోజకప్రజలు మరియు ఈనాడు పాఠకులు జగమెరిగిన సత్యం గుర్తుపెట్టుకోండి మేనేజరా ! అందుకేనేమో నియోజకవర్గంలో ఒక మండలానికి ఖాళీగా వున్న ఈనాడు పత్రిక పాత్రికేయా పోస్ట్ ను చలపతికి మరియు ఈనాడు సంస్థనుండి నిష్క్రమించిన మరో ఇద్దరు సిఫారసు చేసినవారికి మాత్రమే కట్టబెట్టాలని అదే మండలానికి చెందిన మరో ఎదవ ఉపాధ్యాయున్ని బ్రోకర్ గా పెట్టి మార్కెట్లో వీరు చెప్పిన రేటు పలుకక పోగా గత రెండు సంవత్సరాలుగా అలాగే ఉంచి భర్తీ చేయకుండా మండలంలో జరిగే ఎటువంటి సంఘటనలైనా పత్రికలో వార్త ను కనిపించకుండా అడ్డుపడుతున్న బ్రోకర్ల జంటలతో నిత్యం మేనేజర్ కేవలం ఫోన్లో మాట్లాడుకొంటూ, చాకిరేవు బ్రదర్స్ మరో బ్రొకెర్తో కదిరి లో నిత్యం చెట్లకింద పోస్ట్ అమ్ముకోవడానికి రేటు విషయంలో చర్చలు జరుపుతున్న పరిస్థితి.
ఇటువంటి బ్రోకర్లవల్ల ఈనాడు దినపత్రికకు ప్రమాదం మరియు బ్రోకర్లు తమ స్వార్థప్రయోజనాలకు పత్రిక పరువు, ప్రతిష్టకు భంగం కలిగించడం తప్ప మరో కోణం లేదు అని సవినయంగా మనవి చేసుకొంటూ ఈనాడు సంస్థ నుండి చలపతిని మరియు రమణ (చాకిరేవు) ను తొలగించండి అని మనవి.
ధన్యవాదాలు
kadiri,
anathapuram Was this information helpful? |
Post your Comment