Address: | ananthapur dist , np kunta mandal, kadiri constitution |
ఉమ్మడి అనంతపురము జిల్లా, నంబులపూలకుంట మండలం ప్రముఖ ఈనాడు దినపత్రిక విలేఖరి 'బోదెమ్ రాజా' అక్రమాల చిట్టా. బోదెమ్ రాజా గత కొన్నిసంవత్సరాలుగా నంబులపూలకుంట మండలంలో ఈనాడు దినపత్రిక విలేకరిగా కొనసాగుతున్నాడు. తనపాత్రికేయ వృత్రిని అడ్డుపెట్టుకొని ఇటుప్రభుత్వ అధికారులను, అటుపాలుకులను ప్రలోభాలకుగురిచేసి దొరికినంతదోచుకోవడం రాజాగారి పాత్రికేయవృత్తిలోభాగం.
మండలకేంద్రంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, అధికారులను బెదిరించి పోస్టల్ RD లను కట్టించడము, నఖిలీధ్రువపత్రాలతో ప్రభుత్వపథకాలనుపొందడము, గుత్తేదారులనుండి సిమెంట్ బస్తాలను, కంకర పొందడము, మండలములోని అంగన్వాడీ కేంద్రాలనుండి పిల్లలకిచ్చే పోషకాహార పదార్తలైనటువంటి గుడ్లు, పాలు అక్రమంగా తెచ్చుకోవడం, చౌకధాన్యపు దుకాణాలనుండి దౌర్జన్యంగా బియ్యం, బ్యాళ్లు, చెక్కెర మొదలగునవి వసూలుచేయడం, మండలంలోని ట్రాక్టర్ల యజమానులకు ఒక్కొక్క ఇసుకలోడ్ కు రూ.1500 నుండి 2000 చెల్లించి తెప్పించుకొని అదేఇసుకను ఒక్కొక్కలోడ్ రూ.6000 నుండి 8000 లకు మార్కెట్ లో అమ్ముకొని సొమ్ముచేసుకొంటున్నాడు. నంబులపూలకుంట పంచాయతీ పరిధిలోని తన 2 నివాసాలకు సైతం గత 6 సంవత్సరాల కాలమునుండి ఉచిత విద్యుత్తును వినియోగించుకుంటున్నారు.
నంబులపూలకుంట పంచాయతీ పరిధిలో ఇప్పుడు తాను నివాసం ఉంటున్న బీసీ హాస్టల్ వెనుకభాగంలో సర్వే నెంబర్: 764 ప్రభుత్వ భూమిని 10 నుండి 15 సెంట్ల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకోవడమే కాకుండా 4 నుండి 5 సెంట్ల స్థలంలో రూ. 70 నుండి 80 లక్షలు వెచ్చించి ఇంటిని నిర్మించి 28 ఏప్రిల్ 2022 తారీఖున గృహ ప్రవేశం చేయడమే కాకుండా గృహప్రవేశానికి ముందు ౩ రోజులు గృహప్రవేశం తరువాత ౩ రోజులు వార్తను వ్రాయలేదు. ఎందుకని ఈనాడు యాజమాన్యం అడిగితే మా భార్యకు ఆరోగ్యం బాగాలేదు అందువలన నేను బెంగళూరు లో వున్నానని జవాబిచ్చాడు. ఇప్పుడు తాను నివాసముంటున్న ఇంటి పక్కన మరో 4 నుండి 5 సెంట్ల స్థలంలో దాదాపుగా రూ.1 కోటి అంచనా వ్యయంతో మరో ఇంటినిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి విషయం మీరు ఆధారాలతో గమనించగలరు. ఇదే ఇంటిపక్కనే కేజీబీవీ ప్రహరీ గోడ ఆనుకొని మరో ఇంటి స్థలానికి గుడిసెనుకూడా నిర్మిచి భద్రపరచుకొన్న ఫోటోను మీరు చూడగలరు. ఇదే సర్వే నెంబర్: 764 మరో ౩ ఇంటి స్థలాలను తన ఆధీనంలో ఉండగా, మరో 2 ఇంటిస్థలాలను తన ఉంపుడుగత్తె కొడుకు అయినా ఈనాడు నంబులపూలకుంట పేపర్ బాయ్ "రమేష్" ఆధీనంలో ఉంచాడు.
గతంలో ఈనాడు పేపర్ బాయ్ కి ప్రభుత్వపథకాల ద్వారా 2 ఇండ్లను లబ్ది చేకూర్చడమే కాకుండా రాజా సొంత గ్రామమైన వెస్ట్ నడిమి పల్లెలో 5 ఎకరాల ప్రభుత్వభూమిని పట్టాచేయించుకొని కరోనా 1st వేవ్ తరువాత మార్కెట్ రేటుకు అమ్మివేసిన విష్యం అందరికి తెలిసిందే. రాజా వార్తను సేకరించడానికి రమేష్ ను మాత్రమే పంపిస్తాడు తాను ఇంట్లో కూర్చొని రమేష్ సేకరించిన ఫోటోలను, రమేష్ ఇచ్చిన వార్తను మాత్రమే వ్రాస్తాడు. మండలంలో ఎక్కడ ఏకార్యక్రమమైనా ఈనాడు పత్రికా విలేకరిగా రమేష్ మాత్రమే హాజరవుతారు. నకిలీ ధ్రువపత్రాన్ని సమర్పించి వికలాంగుడిని అని నెల నెల వికలాంగుల పింఛను పొందుతున్నాడు దీన్ని మీరు ఆధారాలతో గమనించగలరు. నెల నెల అంత్యోదయ పథకం ధ్వారా ప్రభుత్వం నుండి లబ్ది పొందుతున్నాడు. నంబులపూలకుంట మండలంలో సోలార్ హబ్ భూముల సేకరణలో అధికారులను బెదిరించి డమ్మి సర్వేనంబర్లతో పాసుపుస్తకాలను చేయించుకొని సోలార్ భూముల కోటాలో దాదాపుగా రూ.12 లక్షల ప్రభుత్వంనుండి లబ్ది పొందాడు.
నంబులపూలకుంట మండలం ఈనాడు దినపత్రిక విలేఖరి బొడెంరాజా అక్రమాలకు సంబంధించి మాకుదొరికిన కొన్ని ఆధారాలను ఇంతకుముందే ఈనాడు పత్రిక యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినా ఎటువంటి స్పందన లేదు అందువల్ల మీదృష్టికి తీసుకురావడం జరిగింది. మీరైనా దీన్ని నిజాయితితో విచారణజరిపించి వాస్తవాలను తెలుసుకొని తదుపరినిర్ణయాన్ని తీసుకుంటారని మావినతి.
ఇందులోని ఆధారాలు:- వికలాంగుల కోటాలో పెన్షన్ పొందుతున్న ఆధారము, సర్వే నెంబర్: 764 ప్రభుత్వ భూమిని 10 నుండి 15 సెంట్ల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకోవడమే కాకుండా 4 నుండి 5 సెంట్ల స్థలంలో రూ. 70 నుండి 80 లక్షలు వెచ్చించి ఇంటిని నిర్మించి 28 ఏప్రిల్ 2022 తారీఖున గృహ ప్రవేశం చేయడమే కాకుండా, ఇప్పుడు తాను నివాసముంటున్న ఇంటి పక్కన మరో 4 నుండి 5 సెంట్ల స్థలంలో దాదాపుగా రూ.1 కోటి అంచనా వ్యయంతో మరో ఇంటినిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి విషయం మీరు వీడియో, ఫోటోలను, ఆ VIDEOలోవున్నటువంటి ఇద్దరు వ్యక్తులు రాజా గారు మరియు వాళ్ళ అబ్బాయి సాయి గారిని గమనించగలరు. చూడండి ఈనాడు విలేఖరి రాజాగారు ఎంత ధీమాగా నెత్తిన టోపీ, మూతికి మాస్క్ వేసుకొని ఒక సివిల్ ఇంజనీర్ లాగ కబ్జాస్థలానికి మట్టిని నింపిస్తున్నాడో.
నంబులపూలకుంట ఈనాడుపత్రిక విలేఖరి బోదెమ్ రాజాగారి మొబైల్ నం: [protected], [protected] .
Was this information helpful?
Post your Comment