Address: | allapally mandal, bhadradri kothagudem dist |
అయ్యా!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలం. ఆళ్ల పల్లి గ్రామము నివాసి అయిన చింతకాయల కృష్ణయ్య (నరసింహ స్వామి ఆలయ పూజారి) ఇంటి పక్కన తన ఆధీనంలో కొంత ప్రభుత్వ భూమి ఉంది ఈ స్థలాన్ని ఆళ్లపల్లి మండలానికి చెందిన ఈనాడు విలేఖరి gunthoju naveen ఆక్రమించేందుకు ప్రయత్నం చేశాడు. ఈనెల 14వ తేదీన ఉదయం స్థలాన్ని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకునేందుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తుండగా చింతకాయల కృష్ణయ్య భూమి పూజ కార్యక్రమాన్ని అడ్డుకున్నాడు. తన స్థలాన్ని ఆక్రమించుకోవడం తప్పు అని వేడుకొన్నాడు. దీంతో ఆగ్రహం చెందిన ఈనాడు విలేఖరి తాసిల్దార్ తో చెప్పి మొత్తం భూమిని లాక్కుంటామని హెచ్చరించాడు అంతేకాకుండా చింతకాయల కృష్ణయ్యను డిప్యూటీ తాసిల్దార్ వద్దకు తీసుకుని వెళ్ళి పంచాయతీ పెట్టాడు. ఇది ప్రభుత్వ భూమి అని ఈనాడు విలేఖరి ఇల్లు కట్టుకోవచ్చని అడ్డు చెప్పవద్దని చింతకాయల కృష్ణయ్యను హెచ్చరించి ఇంటికి పంపించారు అయితే ఈ స్థలం గతంలోనే వీఆర్ఏలకు ఇచ్చింది కావడంతో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని డిప్యూటీ తాసిల్దార్ గారు విలేఖరి కి సూచించారు.
అయితే ఒక్కడిగా వెళితే స్థలం ఆక్రమణ కుదరకపోవడంతో మరికొంతమంది విలేకరులను వెంటపెట్టుకుని ఆళ్ల పల్లి గ్రామంలోని శాంతి విద్యాలయం (చర్చి స్కూల్) ఎదురుగా ఉన్న స్థలంపై కన్నేసి ఈనెల 20వ తేదీన ఈ స్థలం ఎవరిదో తెలుసుకోకుండానే డోజర్ తో చదును చేసి ప్లాట్లుగా మార్చుకొని పంచుకున్నారు. అయితే ఈ స్థలం 20 సంవత్సరాల క్రితం ఆళ్లపల్లి గ్రామస్తులు అనాధ పిల్లల వసతి గృహం కోసం విరాళంగా చర్చి స్కూల్ కు రాసి ఇచ్చారు. తమ స్థలాన్ని విలేకరులు ఆక్రమించారని తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం విలేకరులను సంప్రదించి ప్రాధేయ పడినప్పటికీ వారి మాట పెడచెవిన పెట్టారు. కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో పాఠశాల యాజమాన్యం ని బెదిరించి స్థలాన్ని విలేకరులకు అప్పగించాలని హెచ్చరించారు. ఈ విషయమై తహసిల్దార్ నోరు మెదపలేదు దీంతో పోలీసు వారిని సంప్రదించగా తాత్కాలికంగా నిర్మాణ పనులను ఆపివేశారు. అయితే స్థల పంచాయతీని గ్రామ పెద్దల సమక్షంలో తేల్చుకోవాలని తాసిల్దార్ సూచించడంతో పంచాయతీ పెడితే పరువు పోతుందని గ్రహించిన విలేకరులు మధ్యవర్తుల తో పాఠశాల యాజమాన్యానికి బెదిరింపులు చేస్తున్నారు. పాఠశాలకు మరో పక్కన గల పానుగంటి మంగ w/o వెంకటేశ్వర్లు ఆధీనం లోని 40 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. దీంట్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా తాసిల్దార్ అడ్డుకోవడంతో సగం భూమి మాకు ఇస్తే మరో సగం భూమిలో మీరు నిర్మాణాలు చేసుకోవడానికి తాసిల్దార్ అడ్డు తగలకుండా చూస్తామని విలేకరులు బేరసారాలు చేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ స్థలం కుదరని పక్షంలో మరో స్థలంలో ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్థల ఆక్రమణలు జరగడానికి అంతటికి కారణం ఆళ్లపల్లి ఈనాడు విలేకరు నవీన్ గుంతోజు పాత్రికేయులను రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో విలేకరులు అంటేనే ప్రజలు భయబ్రాంతులకు గురి అయ్యే పరిస్థితి నెలకొంది. ఫారెస్ట్ వారు రైతుల భూములు లాక్కుంటూ ఉంటే విలేకరులకు మొర పెట్టుకునేది విలేకరులు అధికారుల అండదండలతో భూ ఆక్రమణకు పాల్పడుతుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాపోతున్నారు...
అయ్యా పై విషయమును తమదైన రీతిలో విచారించి మా భూములను కోల్పోకుండా చూడగలరని విన్నపము నా పేరు చెప్పలేకపోతున్న అందుకు క్షమించండి Was this information helpful? |
Post your Comment