మాది అన్నమ్మ చెరువు గాయత్రీ నగర్.
మాకు ప్రధాన సమస్య మంచినీటి సమస్య.
ఈ విషయమై అధికారులుకు ఎన్ని సార్లు కంప్లైంట్స్ ఇచ్చిన. అటువైపునుండీ ఎటువంటి స్పందన రాలేదు.
ఇక్కడ నివసించే వారు రోజువారీ కూలీలు
కష్టపడి బ్రతికే లేబర్ అందువలనే ఇక్కడ ఎటువంటి పనులు జరగటం లేదని అనుకుంటున్నాం.
ఉదయం టైం లో ఎటువంటి నీరు ఇవ్వటం లేదు అలాగే అప్పుడప్పుడు అర్ధరాత్రి 2లేదా3 గంటల సమయంలో నీరు ఇస్తున్నారు.
అర్ధరాత్రి2లేదా3 గంటలు అంటే ఆలోచించండి.
ఒక్కొక్కసారి రెండు లేదా మూడు రోజులు ఇవ్వడం లేదు.
కరోన టైంలో కూడా ట్యాంక్ లను పంపారు.
ఎవరికయినా కరోన వుంటే ఏంటి పరిస్థితి.
దయచేసి మా సమస్య కి పరిస్కారం చూపిస్తారు అని ఆశిస్తున్నాము.
లేని పక్షంలో బిందెలు పట్టుకొని ధర్నా చేస్తాం.
ఈ విషయం ఎంత వరకూ చెరలో అంత వరకు చేరుస్తాం.
దయచేసి మమ్మల్ని పురుగుల్లా వోట్ బ్యాంక్ గా మాత్రం చూడవద్దు. Was this information helpful? |
Post your Comment