Hi sir
Namaste,
I am from Yellareddy,
Of Kamareddy, District,
కామారెడ్డి నుండి ఎల్లారెడ్డి నిజాంసాగర్ పిట్లం రూట్ నందు తిరుగు బస్సులు ఏమాత్రం వేళలకు రావడం లేదు, కామారెడ్డి నుంచి రెండు నుంచి మూడు ఒక్కొక్కసారి బస్సులు నిజాంసాగర్ పిట్లం వైపు వెళుతున్నాయి. ముందు రావలసిన బస్సు వెనుక వెనక రావలసిన బస్సు ముందు బయలుదేరడం అంతేకాకుండా అందరూ నిజాంసాగర్ లో వెయిట్ చేసి మళ్ళీ ఒకేసారి మూడు నుంచి నాలుగు బస్సులు కామారెడ్డి వైపు వస్తున్నాయి దీనివల్ల కొన్ని బస్సులలో అధిక రద్దీ ఉండడం మిగిలిన వాటిలో అసలే ప్రయాణికులు లేకుండా రావడం ప్రయాణికులుగా మేము ఎంతో సమయం వేచి ఉండాల్సి రావడం జరుగుతున్నది.గంట నుండి, గంటన్నర రెండు గంటలు, రెండున్నరగంటల వరకు కూడా ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్లడానికి వేచి చూడాల్సిన పరిస్థితిలో ఏర్పడుతున్నాయి. నిజాంసాగర్ వెళ్లిన బస్సులు, పూర్వం పెళ్ళికి ఎడ్లబండ్లు వెళ్లినట్లుగా అక్కడి నుంచి ఒకేసారి కామారెడ్డి వైపు వస్తున్నాయి. మూడు బస్సులు రావాల్సిన సమయంలో అందరూ అక్కడే వెయిట్ చేసి మూడు ఒకేసారి వస్తున్నారు. దీనివలన అటు సంస్థ ఇటు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది ఏదో ఆకతాయిగా పెడుతున్న మెసేజ్ కాదు కావాలంటే మీరే పరిశీలించగలరు. కావున తమరు పరిశీలించి తగు విచారణ జరిపి తగు చర్య జరిపించి మా ఇబ్బందులను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం.నేను ఇక్కడ 11 20 నిమిషాల నుంచి కామారెడ్డి వెళ్ళుటకు వెయిట్ చేస్తున్నాను.11:30 సమయంలో ఒకేసారి రెండు బస్సులు ఆ తర్వాత ఒక బస్సు మొత్తం మూడు బస్సులు ఇప్పటికి, నిజాంసాగర్ వెళ్లాయి అంతకు ముందు వెళ్లిన బస్సు అక్కడే ఉంది.12.20 సమయంలో మరో బస్సు నిజాంసాగర్ వెళ్ళింది. 12.55 నిమిషాలకు మరో బస్సు నిజాంసాగర్ 12.59. ఇంతవరకు నిజం సాగర్ లో పెట్టిన ఏ బస్సు వెనకకు రాలేదు పరిస్థితి నీ అర్థం చేసుకోగలరు.
01.02 నిమిషాలకు ఇప్పుడు ఒక బస్సు మాత్రమే కామారెడ్డి వెళ్ళుటకు వచ్చింది . Was this information helpful? |
Post your Comment