అయ్యా!
వేగూరు అమర్నాథ్ రెడ్డి అను నేను మాయొక్క ట్రాక్టరు డ్రైవరును పంపించి తే30/12/2016ది న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలంలోని M/S NR FILLING STATION అను IOCL డీలరువద్ద డిసెల్ మరియు పెట్రోలు నాయొక్క RUPAY కార్డు ద్వారా కొనుగోలు చేయటం జరిగింది.
సదరు డిలరు వద్ద నాయొక్క కొనుగోలు మొత్తము విలువ డీసెలు రూ. 2, 299.96, మరియు పెట్రోలు రూ. 400.00 లు
సదరు మొత్తమును నాయొక్క రూపే కార్డునుండి మూడుసార్లుగా (1, 502.00, 802.00, 402.00) ఉపసంహరించటం జరిగింది
దాని సంగతి అలా ఉంచితే ప్రతియొక్క విడతా బిల్లు మొత్తమునకు 2/- అదనంగా ఉపసంహరించటం జరిగింది. అంటే మొత్తము నాదగ్గరనుండి అక్షరములా 6 రూపాయలు అదనంగా నాయొక్క ఖాతానుండి ఉపసంహరించారు.
అంతేకాక నాయొక్క మొత్తము డీసెలు కొనుగోలు విలువ రూ. 2, 299.96 అయితే అదనపు 2రూపాయలు కాక మరొక 0.04 రూపాయలను అదనంగా ఉపసంహరించారు.
సాక్షాత్తూ భారత దేశ ప్రధాని అదనపు ఖర్చు లేకుండా కార్డు కొనుగోళ్ళు చేయమని చేబుతుంటే ఈ ఒక్క లావాదేవీలోనే నాయొక్క విలువైన ధనం Rs. 6.04 వృధా అయినాయి. ఇదే డిలరువద్ద నేను ఇప్పటికే సదరు మాయొక్క డ్రైవరును పంపి పలు మార్లు కొనుగోలు చేసినా ఇప్పటివరకూ అదనపు రుసుములు వసూలు చేయలేదు.ఇది ఎందుకు జరిగింది. ఇది చట్టప్రకారమే జరిగిందా లేక అక్రమ వసూలా మీరేతేల్చండి. ఈ యొక్క అదనపు వసూలు సక్రమమే అయితే దేశ ప్రధానియొక్క కల అయిన నగదు రహిత లావాదేవీలు ఎండమావే అవుతుంది
పరిశీలించి తగు చర్యలు తీసుకోగలరు Was this information helpful? |
Post your Comment